Prabhas: 'ఆది పురుష్' షూటింగులో ప్రభాస్!

  • 'రాధేశ్యామ్' పూర్తిచేసిన ప్రభాస్
  • రీసెంట్ గా 'సలార్' షెడ్యూల్ పూర్తి  
  • 'ఆది పురుష్' కోసం ముంబై వెళ్లిన ప్రభాస్
  • వచ్చే దసరాకు విడుదల చేసే అవకాశం  
Aadipurush movie update

గతంలో ఎప్పుడూ చూపించనంత స్పీడ్ ను ప్రభాస్ ఇప్పుడు చూపిస్తున్నాడు. ఒక సినిమా తరువాత ఒక సినిమాను తాపీగా చేసుకుంటూ వెళ్లే ప్రభాస్, ఒక్కసారిగా తన పద్ధతిని పూర్తిగా మార్చేసుకున్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలను ఒప్పుకుని, ముందుగా అనుకున్న ప్రకారం వాటిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాడు.

ఇటీవలే 'రాధే శ్యామ్' షూటింగును పూర్తి చేసిన ఆయన, ఆ వెంటనే 'సలార్' షెడ్యూల్ ని కూడా పూర్తి చేశాడు. ఇక 'ఆది పురుష్' షూటింగు కోసం రీసెంట్ గా ముంబై వెళ్లి, ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, రామాయణాన్ని దృశ్య కావ్యంగా ఆవిష్కరించనుంది.

శ్రీరాముడిగా ప్రభాస్ .. సీతాదేవిగా కృతి సనన్ .. రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటుస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ .. కృతి సనన్ కాంబినేషన్లో, విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ లో చిత్రీకరిస్తున్నారట. మరికొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని అంటున్నారు. వచ్చే ఏడాది దసరా బరిలో ఈ సినిమా ఉండొచ్చని చెప్పుకుంటున్నారు.

More Telugu News