బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి రూ.10 లక్షలు సాయం ప్రకటించిన సీఎం జగన్
- గుంటూరు జిల్లా విద్యార్థిని హత్య
- దురదృష్టకరమన్న సీఎం జగన్
- విద్యార్థిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
- దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశాలు
ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నిందితుడికి దిశ చట్టం కింద కఠినశిక్ష పడాలని స్పష్టం చేశారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆమె కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.