Andhra Pradesh: ఏపీలో కొత్తగా మరో 1746 కరోనా కేసులు.. అప్ డేట్స్ ఇవిగో!

  • రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది మృతి
  • కరోనా నుంచి కోలుకున్న1,648 మంది
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,766
Andhra Pradesh registers 1746 corona new cases in 24 hours

ఏపీలో కొత్త కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 73,341 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... 1,746 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 304 కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 261 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 20 కేసుల చొప్పున నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 1,648 మంది కరోనా నుంచి కోలుకోగా... రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది మృతి చెందారు.

తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 19,90,656 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,58,275 మంది కోలుకున్నారు. మొత్తం 13,615 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,766 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 2,55,26,861 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

More Telugu News