తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కేశవరావు మృతి పట్ల సంతాపం తెలిపిన సీజేఐ ఎన్వీ రమణ
- జస్టిస్ కేశవరావు గుండెపోటుతో మృతి
- విచారం వ్యక్తం చేసిన సీజేఐ ఎన్వీ రమణ
- న్యాయం కోసం పరితపించే వ్యక్తి అని వెల్లడి
- న్యాయవ్యవస్థకు తీరనిలోటు అని వ్యాఖ్యలు
అనారోగ్యంతో బాధపడుతున్న న్యాయమూర్తి కేశవరావు హైదరాబాదులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఈ తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యారు. ఆయన మృతితో తెలంగాణలో కోర్టులకు సెలవు ప్రకటించారు. సీఎం కేసీఆర్ కూడా జస్టిస్ కేశవరావు మృతి పట్ల స్పందిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.