Telangana: తెలంగాణలో మరోసారి 500కి దిగువన కరోనా రోజువారీ కేసులు

  • గత 24 గంటల్లో 79,231 కరోనా పరీక్షలు
  • 449 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 73 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 8,406 మందికి చికిత్స
Telangana corona daily cases and deaths update

తెలంగాణలో గత 24 గంటల్లో 79,231 కరోనా పరీక్షలు నిర్వహించగా, 449 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 52, వరంగల్ అర్బన్ జిల్లాలో 45 కేసులు గుర్తించారు. ఇక, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 623 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,49,406 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,37,175 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 8,406 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 3,825కి చేరింది.

More Telugu News