టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన భారత అథ్లెట్లకు ఉచిత విమాన ప్రయాణం ఆఫర్
- టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు 7 పతకాలు
- ఒలింపిక్ చరిత్రలో భారత్ కు ఇవే అత్యధికం
- ఐదేళ్ల పాటు ఉచిత ప్రయాణ ఆఫర్ ఇచ్చిన గో ఫస్ట్
- జీవితకాల ఫ్రీ ట్రావెల్ ఆఫర్ ఇచ్చిన స్టార్ ఎయిర్
వీరందరికీ వచ్చే ఐదేళ్ల పాటు ఉచితంగా ప్రయాణించేందుకు టికెట్లు అందిస్తామని గో ఫస్ట్ ప్రకటించింది. భారత్ కు 7 పతకాలు ఎప్పుడూ లభించలేదని, ఇది వేడుకలు చేసుకోవాల్సిన సమయం అని తెలిపింది. అందుకే 2025 వరకు వర్తించేలా ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్నామని గో ఫస్ట్ వివరించింది.
ఇక దేశీయ విమానయాన సంస్థ స్టార్ ఎయిర్ జీవితకాల ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపింది. టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు గెలిచినవారికి ఈ ఆఫర్ అందించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని స్టార్ ఎయిర్ ఓ ప్రకటనలో పేర్కొంది.