స్వాతంత్ర్య దినోత్సవం: రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింస నేపథ్యంలో ఎర్రకోట వద్ద కంటెయినర్లతో గోడలు
- రంగులు వేసి అలంకరిస్తామన్న పోలీసులు
- ఎలాంటి అవకాశం తీసుకోబోమని వెల్లడి
- డ్రోన్ దాడి నేపథ్యంలోనూ కట్టుదిట్టమైన బందోబస్త్

గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్ ర్యాలీని ప్రస్తావించిన పోలీసులు.. తాము ఎలాంటి అవకాశమూ తీసుకోదలచుకోలేదన్నారు. కంటెయినర్లన్నింటికీ రంగులు వేసి అలంకరణలు చేస్తామని చెప్పారు. జమ్మూ ఎయిర్ బేస్ పై ఇటీవలి డ్రోన్ దాడి నేపథ్యంలోనూ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఏటా ఇండిపెండెన్స్ డే నాడు ప్రధాని ఎర్రకోట నుంచి ప్రసంగించే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భద్రతను భారీగా పెంచారు.