Andhra Pradesh: ఏపీలో కొత్తగా 1,546 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Positive Cases and deaths bulletin
  • గత 24 గంటల్లో 59,641 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 416 కేసులు
  • విజయనగరం జిల్లాలో 7 కేసులు
  • రాష్ట్రంలో 15 మంది మృతి
  • ఇంకా 20,582 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 59,641 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,546 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 416 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 229, ప్రకాశం జిల్లాలో 201 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,968 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మంది మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 19,70,008 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,36,016 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,582 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 13,410కి చేరింది.
Andhra Pradesh
Corona Virus
New Cases
Positive
Deaths
Bulletin

More Telugu News