Charan: చరణ్ సరసన కియారా అద్వాని.. అధికారిక ప్రకటన!

  • చరణ్, శంకర్ లతో దిల్ రాజు ప్రాజెక్టు 
  • వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు
  •  
  • సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగు
Charan and Shankar movie update

చరణ్ కథనాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వచ్చిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి మొదలైంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలపైకి వెళుతుందా అని అందరూ ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా కియారా అద్వానిని ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అది నిజమేనని విషయం స్పష్టమైంది. ఈ రోజున కియారా అద్వాని పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా టీమ్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికింది. శంకర్ తో ఆమె ముచ్చటిస్తున్న ఫొటోను పోస్ట్ చేస్తూ, ఈ సినిమా ప్రయాణంలో ఆమె భాగమైనట్టుగా చెప్పారు.  

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనుల్లోనే శంకర్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన తన వైపు నుంచి పనులను చక్కబెడుతూ వస్తున్నాడు. సెప్టెంబర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అది నిజమేననేది తాజా సమాచారం. ఆగస్టు మొదటివారంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిపేలా చూస్తున్నారట.

ఒకవేళ ఆగస్టు మొదటివారంలో కుదరకపోతే, ఆగస్టు 15వ తేదీన పూజా కార్యక్రమాలు జరగడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. సంగీత దర్శకుడిగా తమన్ రంగంలోకి దిగిపోయాడు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

More Telugu News