India: టోక్యో ఒలింపిక్స్: కొనసాగుతున్న భారత హాకీ జట్టు జైత్రయాత్ర.. క్వార్టర్ ఫైనల్స్‌కు మన్‌ప్రీత్ సేన

  • టీమిండియా వరుస విజయాలు
  • పూల్-ఎలో రెండో స్థానం
  • 3-1తో అర్జెంటీనా చిత్తు
Tokyo Olympics India defeats Argentina

టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో దారుణ పరాభవానికి గురైన టీమిండియా ఆ తర్వాత పుంజుకుని వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మొన్న స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-0తో ఘన విజయాన్ని అందుకున్న మన్‌ప్రీత్ సింగ్ సేన నేడు పూల్-ఎ లో భాగంగా అర్జెంటీనాతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో  3-1తో విజయాన్ని అందుకుంది.

మ్యాచ్ మూడో క్వార్టర్‌లో తొలి గోల్ చేసిన టీమిండియా.. నాలుగో క్వార్టర్‌‌లో మరో రెండు గోల్స్ చేసి అర్జెంటీనాను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. పూల్-ఎ లో భారత్ తన చివరి మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. ఈ విభాగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్‌కు ఇది వరుసగా రెండో విజయం.

More Telugu News