Revanth Reddy: అందుకే ఆగస్టు 9న కాంగ్రెస్ పార్టీ ‘దళిత-గిరిజన దండోరా’: వీడియో పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి

revanth reddy slams kcr
షార్ట్స్‌లో చూడండి
టీఆర్‌ఎస్‌ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన దండోరా మోగించడానికి సన్నద్ధమవుతోన్న విష‌యం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర స‌ర్కారు చే‌సిన‌ వంచనను ఎండగడ‌తామ‌ని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఈ క్రమంలో ఆగస్టు 9 నుంచి తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్‌ 17 వరకు పల్లెపల్లెకు తిరిగి ‘దళిత, గిరిజన దండోరా’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

దీనిపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మ‌రోసారి స్పందించారు. తాము ఎందుకు ఈ కార్య‌క్రమాన్ని చేప‌డుతున్నామో ఓ వీడియో ద్వారా వివ‌రించారు. భూమి కోసం ‘బాంఛెన్ కాల్మొక్తా’ అని ఇప్పటికీ గిరిజనం వేడుకుంటోన్న దృశ్యాలు కనిపిస్తోన్న స్వరాష్ట్రం. ఈ పరిస్థితిని ప్రశ్నించేందుకే నాడు క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన ఆగస్టు 9న కాంగ్రెస్ పార్టీ ‘దళిత-గిరిజన దండోరా’కు శంఖారావం పూరిస్తోంది. ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా ప్రశ్నించే గొంతుక నినదించబోతోంది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
KCR

More Telugu News