టీమిండియాతో చివరి వన్డే.. రాణించిన లంక టాపార్డర్
- కొలంబోలో భారత్, శ్రీలంక మ్యాచ్
- మొదట బ్యాటింగ్ చేసిన భారత్
- 225 పరుగులకు ఆలౌట్
- లక్ష్యఛేదనలో మెరుగైన స్థితిలో లంక
ఓవర్లు కుదించడంతో లంక లక్ష్యాన్ని 227 పరుగులుగా నిర్దేశించారు. ఓపెనర్ మినోద్ భానుక 7 పరుగులకే వెనుదిరిగినా... మరో ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో (57 బ్యాటింగ్), భానుక రాజపక్స జోడీ స్కోరుబోర్డును ముందుకు ఉరికించింది. రాజపక్స 65 పరుగులు చేసి సకారియా బౌలింగ్ లో అవుటయ్యాడు.
ప్రస్తుతం శ్రీలంక స్కోరు 23 ఓవర్లలో 2 వికెట్ నష్టానికి 144 పరుగులు కాగా, ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 83 పరుగులు చేయాల్సి ఉంది. వర్షం పడడంతో ఓవర్లను 47కి కుదించిన సంగతి తెలిసిందే.