మీ బెయిల్ రద్దు చేయమని కోరితే రాజద్రోహం ఎలా అవుతుంది?: రఘురామకృష్ణరాజు
- నాపై అనర్హత వేటు పడే అవకాశమే లేదు
- అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇంతకాలం వైసీపీ నేతలు నిందలు వేశారు
- పెగాసస్ సాఫ్ట్ వేర్ ను చాలా మందిపై మీరు వాడారని అంటున్నారు
తమ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని రఘురాజు అన్నారు. దసపల్లా హోటల్ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై నిజాయతీ కలిగిన అధికారితో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయాలని జగన్ ఆదేశిస్తే... వైసీపీకి చెందిన ఎంపీలందరూ రాజీనామా చేస్తే, కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందని చెప్పారు. రాజీనామా చేయడానికి తాను సిద్ధమని... ఆజ్ఞాపించడానికి మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ను చాలా మందిపై మీరు వాడారని అంటున్నారని... అది వాడటానికి మీరు కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారు.