హర్యానా డిప్యూటీ స్పీకర్ కారుపై దాడి ఘటన.. అధికారులతో రైతుల చర్చలు విఫలం
- హర్యానా డిప్యూటీ స్పీకర్ రణబీర్ గంగ్వా కారుపై గత వారం దాడి
- వంద మంది రైతులపై రాజద్రోహం కేసు
- చర్చలు విఫలం కావడంతో రైతుల నిరవధిక ధర్నా
రైతులపై రాజద్రోహం కేసులు నమోదు చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ఈ కేసుల విషయమై నిన్న 20 మంది రైతుల బృందం జిల్లా అధికారులతో రెండు గంటలపాటు చర్చలు జరిపింది. ఈ చర్చలు విఫలమైనట్టు రైతు నేతలు తెలిపారు. చర్చలు విఫలం కావడంతో రైతులు అక్కడి మినీ సచివాలయం వద్ద నిరవధిక ధర్నాకు దిగారు.