Pakistan: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ మృతి

Former Pakistan president Mamnoon Hussain passes away in Karachi
  • ఏడాదిన్నర కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న హుస్సేన్
  • కరాచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • 1940లో భారత్‌లోని ఆగ్రాలో జన్మించిన హుస్సేన్
ఏడాదిన్నర కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ నిన్న మృతి చెందారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. పాకిస్థాన్ ముస్లింలీగ్ (నవాజ్) పార్టీ నేత అయిన హుస్సేన్ కరాచీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణవార్తను కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ధ్రువీకరించారు. భారతదేశంలోని ఆగ్రాలో 1940లో జన్మించిన ఆయన 2013 నుంచి 18 వరకు పాకిస్థాన్ 12వ అధ్యక్షుడిగా ఉన్నారు.
Pakistan
Mamnoon Hussain
Karachi
Passed Away

More Telugu News