ఎవడబ్బ సొమ్మని ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటారు?: నారా లోకేశ్
- ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించకపోతే స్థలాలను వెనక్కి తీసుకుంటామని బెదిరించడం దారుణం
- ఇళ్లు కట్టించి ఇస్తామన్న జగన్ హామీ ఎక్కడికి పోయింది?
- ఈరోజు గోడవర్రు గ్రామంలో పర్యటించాను
మంగళగిరి నియోజకవర్గం గోడవర్రు గ్రామంలో ఈరోజు తాను పర్యటించానని లోకేశ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ కక్ష సాధింపులకు పాల్పడిన టీడీపీ కార్యకర్త గోరంట్ల అనిల్ కుటుంబాన్ని పరామర్శించానని చెప్పారు. కరోనాతో పోరాడి, కోలుకున్న గోడవర్రు గ్రామస్తులు, సర్పంచ్ విశ్వనాథపల్లి శివకుమార్ కుటుంబాన్ని పరామర్శించానని అన్నారు. గ్రామంలో టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 60 మందికి కోవిడ్ చికిత్స అందించామని చెప్పారు. ఈ సందర్భంగా అనేక సమస్యలను తన దృష్టికి ప్రజలు తీసుకొచ్చారని... వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.