దేశవ్యాప్తంగా సెప్టెంబరు 12న 'నీట్'
- జులై 13 నుంచి దరఖాస్తులు
- ఎన్టీయే వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు
- ప్రకటన చేసిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్ష
ఈ మేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ ప్రకటన చేశారు. గతేడాది కంటే ఈసారి పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచుతున్నట్టు తెలిపారు. 2020లో దేశవ్యాప్తంగా 3,862 పరీక్ష కేంద్రాల్లో 'నీట్' నిర్వహించామని, ఈసారి వాటి సంఖ్య పెంపు ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా, 'నీట్' జరిగే నగరాలు, పట్టణాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచుతున్నట్టు వివరించారు.