AP Govt: ఏపీ ఫైబర్ నెట్లో అక్రమాలపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం

AP Govt orders CID probe into alleged AP Fiber Net irregularities
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు రావడం తెలిసిందే. ఇంటింటికీ ఇంటర్నెట్, టెలిఫోన్, టీవీ చానళ్లను ఒకే కేబుల్ కనెక్షన్ ద్వారా ఇవ్వాలని గత ప్రభుత్వం భావించింది. అయితే, అందుకు అవసరమై జి పాన్ సెట్ టాప్ బాక్సులు, ఇతర సాంకేతిక పరికరాల కొనుగోళ్ల టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ప్రాథమికంగా కొన్ని అంశాలను గుర్తించి, వాటిని ప్రభుత్వానికి నివేదించారు. ఆయా అంశాలను పరిశీలించిన ప్రభుత్వం ఈ వ్యవహారంలో లోతైన దర్యాప్తు అవసరం అని భావించింది. ఈ నేపథ్యంలో, దీనిపై సీఐడీ దర్యాప్తు చేయాలంటూ ఆదేశించింది. సమగ్రంగా విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని సీఐడీ అడిషనల్ డీజీకి స్పష్టం చేసింది.
Go Back to Shorts
AP Govt
CID
AP Fiber Net
Tenders
Probe
TDP
Andhra Pradesh

More Telugu News