Telangana: తెలంగాణలో కొత్తగా 731 మందికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 1,02,761 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 80 కేసులు
  • అత్యల్పంగా నారాయణ్ పేట్ జిల్లాలో 2 కేసులు
  • ఇంకా 11,206 మందికి చికిత్స
Telangna corona health bulletin

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,02,761 కరోనా పరీక్షలు నిర్వహించగా, 731 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 80 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నారాయణ్ పేట్ జిల్లాలో రెండు కేసులు వెల్లడయ్యాయి. ఖమ్మం జిల్లాలో 64, నల్గొండ జిల్లాలో 56 కేసులు గుర్తించారు. అదే సమయంలో 993 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 3,714 మంది కరోనాతో మృతి చెందారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 6,29,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,14,865 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 11,206 మంది చికిత్స పొందుతున్నారు.

More Telugu News