Rahul Gandhi: మోదీ పెంచిన గ‌డ్డాన్ని గుర్తు చేస్తూ రాఫెల్ కొనుగోళ్ల‌పై ఫొటో పోస్ట్ చేసిన‌ రాహుల్ గాంధీ!

  • రాఫెల్ యుద్ధ విమానం, మోదీ గ‌డ్డంతో రూపుదిద్దిన గ్రాఫిక్స్ ఫొటో
  • దొంగ గ‌డ్డం అంటూ తీవ్ర వ్యాఖ్య
  • రాఫెల్ కుంభ‌కోణం అంటూ హ్యాష్‌ట్యాగ్  
rahul gandhi slams govt

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ పెంచిన గ‌డ్డాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ నేత‌లు కొన్ని రోజులుగా చుర‌క‌లంటిస్తోన్న విష‌యం తెలిసిందే. తాజాగా, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవ‌క‌త‌వ‌క‌ల ఆరోప‌ణ‌ల అంశం మ‌రోసారి తెర మీద‌కు వ‌చ్చింది. దీంతో ఈ విష‌యాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మ‌రోసారి మోదీ గ‌డ్డంపై చుర‌క‌లంటించారు. రాఫెల్ యుద్ధ విమానం, మోదీ గ‌డ్డంతో రూపుదిద్దిన ఓ గ్రాఫిక్స్ ఫొటోను ఆయ‌న పోస్టు చేస్తూ ‘దొంగ గ‌డ్డం’ అంటూ తీవ్ర వ్యాఖ్య చేశారు.

రాఫెల్ కుంభ‌కోణం అంటూ హ్యాష్‌ట్యాగ్ జోడించారు. ఇదే ఫొటో, హ్యాష్‌ట్యాగ్ తో ప‌లువురు కాంగ్రెస్ కీల‌క నేత‌లు కూడా ట్వీట్లు చేస్తున్నారు. కాగా, యుద్ధ విమానాలను ప్ర‌ధాని మోదీ ప్రభుత్వం ఎక్కువ ధ‌ర‌ల‌కు కొనుగోలు చేస్తోంద‌ని, ఇందులో అవినీతి జ‌రిగింద‌ని కాంగ్రెస్ పార్టీ మొద‌టి నుంచీ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే. బీజేపీ నేత‌లు మాత్రం కాంగ్రెస్ నేత‌ల ఆరోప‌ణ‌లను తిప్పికొడుతున్నారు.  

       

More Telugu News