Haity: హైతీలో కూలిన విమానం... ఆరుగురి మృతి!

  • పోర్ట్ యూ ప్రిన్స్ సమీపంలో ప్రమాదం
  • టేకాఫ్ అయిన తరువాత ప్రమాదం
  • విచారణకు ఆదేశించిన అధికారులు
Six Dead in Flight Accident in Hathi

హైతీ రాజధాని పోర్ట్ యూ ప్రిన్స్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు అమెరికన్ మిషనరీ సభ్యులు సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన శనివారం నాడు జరిగింది. నగరంలోని ఎయిర్ పోర్టు నుంచి నిన్న సాయంత్రం గం. 6.57 లకు బయలుదేరిన విమానం, ఓ గంట తరువాత హైతీ దక్షిణ తీరంలో కూలిపోయిందని ఎన్సీఏఓ (నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆఫీస్) ఓ ప్రకటనలో తెలిపింది. ఆరుగురితో వెళుతున్న విమానం కూలిపోగా, అందరూ మృత్యువాత పడ్డారని పేర్కొంది. విమాన ప్రమాదంపై విచారణకు ఆదేశిస్తున్నామని, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపింది.

More Telugu News