మహిళా క్రికెట్ లో అరుదైన రికార్డు సృష్టించిన మిథాలీ రాజ్!
- అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు
- ప్రస్తుతం ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న మహిళల జట్టు
- తాజా మ్యాచ్ లో రికార్డు సాధించిన మిథాలీ
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తాజా మ్యాచ్ లో మిథాలీ ఈ రికార్డును అధిగమించింది. వర్షం కారణంగా కొంతమేరకు అవాంతరాలు ఏర్పడిన మ్యాచ్ ని 47 ఓవర్లకు కుదించగా, ఇంగ్లండ్ విధించిన 220 పరుగుల టార్గెట్ ను భారత్ ఛేదించింది.
మ్యాచ్ మధ్యలో అవుట్ కాకూడదని, ఈ గేమ్ లో గెలిచి తీరాలని, చివరి వరకూ పోరాడాలని తాను భావించానని మ్యాచ్ అనంతరం మిథాలీ వెల్లడించింది. ఛేజింగ్ తనకు ఇష్టమని, టీమ్ కోసం మ్యాచ్ ని గెలవడమే లక్ష్యంగా ఆడానని మిథాలీ పేర్కొంది. కాగా, మిథాలీ రాజ్ సాధించిన ఈ విజయం, ఆపై దక్కిన అత్యధిక పరుగుల రికార్డుపై పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు అభినందనలు తెలిపారు.