18 ఏళ్లకు పైబడిన వారికి టీకాల కోసం జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక కేంద్రాలు
- ఇప్పటిదాకా 45 ఏళ్లకు పైబడిన వారికి టీకాలు
- ఇక యువతకు కూడా వ్యాక్సినేషన్
- జీహెచ్ఎంసీ పరిధిలో 100 సెంటర్లు
- ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సేవలు
దీనిపై జీహెచ్ఎంసీ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ స్పందిస్తూ, 18 ఏళ్లకు పైబడిన వారు తమకు సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రాలను సందర్శించాలని పిలుపునిచ్చారు. ముందుగా కొవిన్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకున్న తర్వాత, వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళితే వేచి చూడాల్సిన అవసరం లేకుండా వెంటనే టీకా వేస్తారని వివరించారు.