Kriti Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • షూటింగులో జాయిన్ అవుతున్న కృతిశెట్టి 
  • వంద కోట్ల బడ్జెట్టుతో కమలహాసన్ సినిమా
  • దేవిశ్రీ ప్రసాద్ హీరోగా చార్మి నిర్మించే చిత్రం  
Kriti Shetty joins new film shoot

*  'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం 'ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది'.  సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న  ఈ చిత్రం షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. కృతిశెట్టి నేడు ఈ షూటింగులో జాయిన్ అవుతోంది.
*  ప్రస్తుతం 'ఇండియన్ 2', 'విక్రమ్' సినిమాలలో నటిస్తున్న ప్రముఖ నటుడు కమలహాసన్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ ప్రసిద్ధ నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఇది వంద కోట్ల బడ్జెట్టుతో తెరకెక్కుతుంది.
*  ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారనున్నాడు. ఆయన హీరోగా ఓ హారర్ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నటి చార్మి  నిర్మించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

More Telugu News