Anchor Pradeep: 'ఏపీ రాజధాని' వివాదంపై క్షమాపణలు చెప్పిన యాంకర్ ప్రదీప్

  • వివాదాస్పదమైన యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యలు
  • ఏపీ రాజధాని విశాఖ అంటూ టీవీ షోలో వెల్లడి
  • ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం
  • వీడియో సందేశం వెలువరించిన ప్రదీప్
Anchor Pradeep conveys apologies for his tv show controversy

ఓ టీవీ కార్యక్రమంలో ఏపీ రాజధాని విశాఖ అంటూ పేర్కొనడం పట్ల యాంకర్ ప్రదీప్ పై ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, యాంకర్ ప్రదీప్ స్పందించారు. తన సందేశంతో కూడిన ఓ వీడియో విడుదల చేశారు. తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ నొప్పించలేదని, ఎవరినీ కించపర్చాలని ఈ విధంగా చేయలేదని స్పష్టం చేశారు.

రాష్ట్రం, రాజధాని... అనే అంశంపై టీవీ షోలో ప్రశ్నలు అడుగుతుండగా ఆ అంశం తప్పుదారి పట్టిందని పేర్కొన్నారు. వాస్తవానికి ఇలాంటి అంశాలకు తాను దూరంగా ఉంటానని, ప్రేక్షకులకు వినోదం అందించడమే తన ప్రాధాన్యత అని ప్రదీప్ వెల్లడించారు. అందుకు మీ ఆశీస్సులు కావాలి అంటూ తన సందేశాన్ని ముగించారు.

More Telugu News