పుట్టినరోజు నాడు పోలీసుల విచారణను ఎదుర్కొన్న మిథున్ చక్రవర్తి
- బెంగాల్ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన మిథున్
- మోదీ సమక్షంలో వైరిపక్ష నేతలపై తీవ్ర వ్యాఖ్యలు
- ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కోల్ కతా పోలీసులు
ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయిన ఆయన ప్రసంగిస్తూ... అధికార టీఎంసీ పార్టీ శ్రేణులపై విరుచుకుపడ్డారు. 'ఇక్కడ నేను కొడితే... వాళ్ల శరీరాలు శ్మశానంలో పడతాయి' అని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మార్చి 7వ తేదీన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆ సభలోనే మిథున్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మోదీ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు.