Priyanka Gandhi: మోదీ ఎంత పిరికివారంటే.. మహమ్మారి చెలరేగిపోతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నారు: ప్రియాంక గాంధీ ఫైర్

  • మోదీపై నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ
  • దేశ ప్రతిష్ఠను దిగజార్చారని మండిపాటు
  • ప్రధాని అసమర్థత ప్రపంచానికి తెలిసిపోయిందన్న కాంగ్రెస్ నేత
PM Behaved Like Coward fires Priyanka Gandhi

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ చాలా పిరికివారని, కరోనా మహమ్మారి చెలరేగిపోతుంటే ఆయన మాత్రం ఏం చేయకుండా చేష్టలుడిగి చూస్తుండిపోయారని ఎద్దేవా చేశారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రధాని దారుణంగా విఫలమయ్యారని అన్నారు. ఆయన అసమర్థత ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిందంటూ వరుస ట్వీట్లు చేశారు.

దేశ ప్రతిష్ఠను మోదీ దిగజార్చారని ప్రియాంక ధ్వజమెత్తారు. మోదీకి ప్రజల కంటే రాజకీయాలే ముఖ్యమని, ఆయనకు వాస్తవాలతో పనిలేదని, ప్రచారం ఉంటే చాలని అన్నారు. విపత్తును ఎదుర్కోవడంలో ఎవరు విఫలమయ్యారో ప్రధానిని ప్రజలు అడిగే సమయం వచ్చిందన్నారు. కాగా, విపత్తు వైఫల్యానికి ‘బాధ్యులెవరు?’ (జిమ్మేదార్ కౌన్) హ్యాష్‌ట్యాగ్‌తో చేపట్టిన ప్రచారంలో భాగంగా పలు సామాజిక మాధ్యమాల్లో ప్రియాంక గాంధీ పోస్టులు పెట్టారు.

More Telugu News