డబ్ల్యూటీసీ ఫైనల్: ప్రాక్టీసు ప్రారంభించిన టీమిండియా

Team India starts practice for WTC Final against New Zealand
  • ఈ నెల 18 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
  • భారత్ వర్సెస్ కివీస్
  • వార్మప్ మ్యాచ్ లు లేకుండానే బరిలో దిగనున్న భారత్
  • ప్రాక్టీసు సెషన్లలో చెమటోడ్చాలని నిర్ణయం
ఈ నెల 18 నుంచి సౌతాంప్టన్ లో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరు కోసం ఇంగ్లండ్ చేరుకున్న భారత ఆటగాళ్లు సాధన మొదలుపెట్టారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో సౌతాంఫ్టన్ మైదానంలో కసరత్తులు, నెట్ ప్రాక్టీసు చేశారు. ఈ మేరకు బీసీసీఐ ఓ వీడియో పంచుకుంది.

భారత్ నుంచి ఇంగ్లండ్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు మొదట 3 రోజుల పాటు క్వారంటైన్ లో గడిపారు. ఆపై బృందంగా కాకుండా, ఒక్కొక్కరుగా మైదానంలో సాధన చేశారు. అనంతరం తొలిసారిగా బృందంగా ప్రాక్టీసు చేశారు. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ నేడు ప్రారంభమైంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ నాటికి కివీస్ కు సరైన మ్యాచ్ ప్రాక్టీసు లభిస్తుండగా, భారత్ కు కనీసం వార్మప్ మ్యాచ్ లు ఆడే అవకాశం లేకపోయింది. దాంతో ఈ నెల 18న నేరుగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అందుకే ప్రాక్టీసు సెషన్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని భారత జట్టు యాజమాన్యం భావిస్తోంది.
Go Back to Shorts
Team India
Practice
WTC Final
New Zealand
Southampton
England

More Telugu News