భారత్ కు రూ.3,640 కోట్ల ఆర్థికసాయం ప్రకటించిన ప్రపంచబ్యాంకు
- భారత్ లో కరోనా సంక్షోభం
- తీవ్రంగా ప్రభావితమైన ఎంఎస్ఎంఈ రంగం
- ప్రభుత్వ సాయమే ఆసరా
- ఆర్థికసాయం మంజూరుకు బ్యాంకు డైరెక్టర్ల ఆమోదం
2020 ఆరంభంలో భారత్ లో ప్రవేశించిన కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యంతో పాటు ఎంఎస్ఎంఈ (చిన్న, మధ్య తరహా వ్యాపారాలు) రంగాన్ని కూడా అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో 5.55 లక్షల వ్యాపార సంస్థలు ప్రభుత్వ సాయం పొందుతున్నాయి. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈల పునరుద్ధరణకు ప్రపంచబ్యాంకు నిధులు ఊతమిస్తాయని భావిస్తున్నారు.