పేదల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు: జోగి రమేశ్
- వైఎస్సార్ జగనన్న కాలనీల గృహనిర్మాణాలు ప్రారంభం
- సీఎం జగన్ పై జోగి రమేశ్ ప్రశంసలు
- జగన్ పాలనకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వెల్లడి
- జగన్ బీసీల ఆత్మబంధువు అని వ్యాఖ్యలు
ఈ సందర్భంగా జోగి రమేశ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలుగు డ్రామా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అంటూ అభివర్ణించారు. ఎల్లో మీడియాతో కలిసి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. ఇవాళ చంద్రబాబు వెంట ఏ కులం, ఏ వర్గం కూడా లేదని అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారని, సీఎం జగన్ పాలనకు ఏపీ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని జోగి రమేశ్ చెప్పుకొచ్చారు. బీసీల ఆత్మబంధువు సీఎం జగన్ అని కీర్తించారు.