Rains: ఏపీలో రేపటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • వచ్చే 24 గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు
  • ఉత్తరకోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
  • దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
AP to recieve Rains next three days

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని, ఇవి క్రమంగా బలపడుతుండడంతో వాటి ప్రభావం రాష్ట్రంపైనా ఉంటుందని తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపటి నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే, దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.


More Telugu News