కొవిడ్ సోకినవారికే ఆనందయ్య మందు... ఎమ్మెల్యే కాకాని వివరణ
- ఆనందయ్య మందు విధివిధానాలకు రూపకల్పన
- వికేంద్రీకరణ పద్ధతిలో మందు పంపిణీ
- పోస్టు కొరియర్ ద్వారానూ అందుకోవచ్చన్న కాకాని
- ఎవరూ కృష్ణపట్నం రావొద్దని విజ్ఞప్తి
అయితే, కరోనా సోకిన వారికే తొలి ప్రాధాన్యత అని, మందును మొదట వారికే అందిస్తామని కాకాని స్పష్టం చేశారు. ఆ తర్వాత క్రమంలో, కరోనా రాకుండా మందు ఇవ్వనున్నట్టు వివరించారు. ఆన్ లైన్ విధానంలో మందు పంపిణీ చేస్తున్నందున, కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రజలెవరూ కృష్ణపట్నం రావొద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఆనందయ్య మందు పంపిణీపై చర్చించేందుకు నిన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆనందయ్య, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ హాజరయ్యారు.