Mahesh Babu: వచ్చేనెలలో సెట్స్ పైకి త్రివిక్రమ్ .. మహేశ్!

  • మహేశ్ మూవీ కోసం త్రివిక్రమ్ సన్నాహాలు
  • ఇక ఆలస్యం చేసే ఆలోచన లేదు 
  • పట్టాలెక్కించాలనే పట్టుదలతో మహేశ్
  • కథానాయికగా పూజ హెగ్డే
Mahesh Babu and Trivikram movie is going to start in July

త్రివిక్రమ్.. మహేశ్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పనుల్లోనే త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. యాక్షన్ తో కూడిన ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాకి 'పార్థు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిన్న కృష్ణ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ వస్తుందని అభిమానులు అనుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాంటివేం వద్దని మహేశ్ బాబు చెప్పినట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా ఆలస్యమవుతుందేమోననే సందేహం అభిమానుల్లో తలెత్తింది. కానీ వచ్చేనెల నుంచే ఈ సినిమా షూటింగును మొదలుపెట్టే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయట. ఒక వైపున  'సర్కారువారి పాట' చేస్తూనే త్రివిక్రమ్ సినిమా షూటింగులోను పాల్గొనాలని మహేశ్ నిర్ణయించుకున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది.

More Telugu News