Balakrishna: 'క్రాక్' సినిమా కథ ముందు బాలకృష్ణ వద్దకే వెళ్లిందట!

  • ముందుగా బాలకృష్ణ దగ్గరికెళ్లిన కథ
  • కొన్ని కారణాల వలన కుదరని ప్రాజెక్టు
  • నెక్స్ట్ మూవీ బాలకృష్ణతోనే  
Balakrishna would do the Krack move at first

రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా తెరకెక్కింది. లాక్ డౌన్ తరువాత వచ్చిన సినిమాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. తాజాగా ఈ సినిమా గురించిన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే, ఈ కథ ముందుగా బాలకృష్ణ దగ్గరికి వెళ్లిందట. అయితే కొన్ని కారణాల వలన ఆయనతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. దాంతో గోపీచంద్ మలినేని, హీరో బాడీ లాంగ్వేజ్ ను రవితేజకు తగినట్టుగా మార్చుకుని ఆయనను బరిలోకి దింపాడట.

గోపీచంద్ మలినేని - రవితేజ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'డాన్ శీను' .. 'బలుపు' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో సహజంగానే 'క్రాక్' పై కూడా అంచనాలు పెరుగుతూ వచ్చాయి. కథాకథనాల్లో దమ్ము ఉండటంతో ఈ సినిమా అంచనాలను అందుకోగలిగింది .. హిట్టు తెచ్చుకోగలిగింది. బాలకృష్ణతో 'క్రాక్' చేయలేకపోయిన కారణంగానే, గోపీచంద్ మలినేని ఆ తరువాత సినిమాను ఆయనతోనే పట్టాలెక్కిస్తున్నాడట.

More Telugu News