Nithin: ఓటీటీలో 'రంగ్ దే' రిలీజ్.. డేట్ ఖరారు!

  • మార్చ్ నెలలో థియేటర్లకు వచ్చిన 'రంగ్ దే'
  • ఆశించిన స్థాయిలో లభించని ఆదరణ
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
  • జూన్ 12న జీ 5లో విడుదల  
Rang De will be release soon in OTT

నితిన్ .. కీర్తి సురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన 'రంగ్ దే' సినిమా, ఈ మార్చి లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోస్టర్స్ వదిలిన దగ్గర నుంచే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. నితిన్ - కీర్తి జోడీ బాగుందనే టాక్ వచ్చింది.

 టీజర్ .. ట్రైలర్ చూసి ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించని కారణంగా ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అలాంటి సినిమాను ఇప్పుడు ఓటీటీలో వదలడానికి రంగం సిద్ధమైపోయింది.

జూన్ 12వ తేదీన జీ 5లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రేమ - పెళ్లి చుట్టూ అందంగా .. సరదాగా సాగే డ్రామా ఇది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే.

More Telugu News