Andhra Pradesh: ఏపీలో భారీగా నమోదైన కరోనా కేసులు.. 99 మంది మృతి

  • 24 గంటల్లో 18,285 పాజిటివ్ కేసుల నమోదు
  • చిత్తూరు జిల్లాలో 15 మంది మృతి
  • రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 1,92,104 
More than 18k corona cases registered in Andhra Pradesh

సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 18,285 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 99 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది, విజయనగరం జిల్లాలో 9 మంది చనిపోయారు. ఇదే సమయంలో 24,105 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 16,27,390కి చేరుకోగా... 14,24,859 మంది కోలుకున్నారు. 10,427 మంది మృతి చెందారు.

More Telugu News