30న తెలంగాణ కేబినెట్ భేటీ.. లాక్డౌన్పై కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్
- రాష్ట్రంలో వ్యవసాయం, ధాన్యం సేకరణపై చర్చ
- విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలపై భేటీ
- పాల్గొననున్న సోమేశ్ కుమార్, ఇతర అధికారులు
రాష్ట్రంలో వ్యవసాయం, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు, కరోనా, లాక్ డౌన్ తదితర అంశాలపై కేబినెట్ చర్చించనుందని తెలంగాణ సీఎంవో తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ఈ భేటీలో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులు కూడా పాల్గొంటారు.