Andhra Pradesh: ఏపీలో బ్లాక్ ఫంగస్ కు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు ఇవే!

  • దేశ వ్యాప్తంగా పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు
  • బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీ కిందకు తెచ్చిన ఏపీ ప్రభుత్వం
  • 17 ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ కు చికిత్స
List of hospitals treating for black funguns in AP

కరోనా వైరస్ పంజా విసురుతున్న తరుణంలో... బ్లాక్ ఫంగస్ వ్యాధి జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీని బారిన పడిన వారు కంటి చూపును కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాలు దీనిపై దృష్టి సారిస్తున్నాయి. ఏపీ విషయానికి వస్తే... ఈ ఫంగస్ ట్రీట్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చింది. అంతేకాదు రాష్ట్రంలోని పలు కీలక ప్రభుత్వాసుపత్రుల్లో దీని ట్రీట్మెంట్ కు ఏర్పాట్లు చేసింది.

ఏపీలో బ్లాక్ ఫంగస్ కు ట్రీట్మెంట్ చేసే ఆసుపత్రులు ఇవే:

  • అనంతపూర్  ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)
  • ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్, తిరుపతి
  • స్విమ్స్, తిరుపతి
  • జీజీహెచ్, కాకినాడ
  • జీజీహెచ్, గుంటూరు
  • జీజీహెచ్ (రిమ్స్), కడప
  • జీజీహెచ్, విజయవాడ
  • గవర్నమెంట్ రీజినల్ ఐ ఆసుపత్రి, కర్నూల్
  • జీజీహెచ్, కర్నూలు
  • జీజీహెచ్ (రిమ్స్), ఒంగోలు
  • జీజీహెచ్ (ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల), నెల్లూరు
  • జీజీహెచ్, శ్రీకాకుళం
  • ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి, విశాఖపట్నం
  • గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్, విశాఖపట్నం
  • ప్రభుత్వ ఛాతీ వ్యాధుల ఆసుపత్రి (ఆంధ్ర మెడికల్ కాలేజి)
  • కింగ్ జార్జ్ ఆసుపత్రి, విశాఖపట్నం
  • విమ్స్, విశాఖపట్నం.

More Telugu News