Andhra Pradesh: ఏపీ వ్యవసాయ బడ్జెట్​.. ప్రధాన అంశాలు!

  • వ్యవసాయ బడ్జెట్ రూ.68,000 కోట్లు
  • రైతు భరోసా, పీఎం కిసాన్ కు రూ.17,030 కోట్లు
  • ధాన్యం కొనుగోళ్లకు రూ.18,343 కోట్లు
  • ఉచిత విద్యుత్ కు రూ.17,430 కోట్లు
AP Allocates Rs 68000 crore for Agriculture

ఏపీ ప్రభుత్వం రూ.2.3 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులను ఆ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో వెల్లడించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ బడ్జెట్ ను కేటాయించినట్టు ఆయన చెప్పారు.

ముఖ్యాంశాలు..

  • వ్యవసాయ బడ్జెట్ రూ.68,000 కోట్లు
  • రైతు భరోసా, పీఎం కిసాన్ కోసం రూ.17,030 కోట్లు
  • సున్నా వడ్డీ పంట రుణాల కోసం రూ.573 కోట్లు
  • వైఎస్సార్ ఉచిత పంట బీమా కోసం రూ.1,252 కోట్లు
  • పంట నష్ట పరిహారం కోసం రూ.1,038 కోట్లు
  • ధాన్యం కొనుగోళ్లకు రూ.18,343 కోట్లు
  • ఇతర పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు రూ.4,761 కోట్లు
  • ఉచిత విద్యుత్ కోసం రూ.17,430 కోట్లు
  • విద్యుత్ ఫీడర్ల చానెళ్ల సామర్థ్య పెంపునకు రూ.1,700 కోట్లు
  • శనగ పంట క్యాష్ సబ్ వెన్షన్ కోసం రూ.300 కోట్లు
  • సూక్ష్మ సేద్యానికి రూ.1,224 కోట్లు
  • ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధరను రూపాయిన్నరకే సరఫరా చేయడానికి రూ.1,520 కోట్లు

గత ప్రభుత్వం బకాయిల చెల్లింపుల కోసం రూ.2,771 కోట్లు

  • వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాల మాఫీ కోసం రూ.688 కోట్లు
  • విత్తన బకాయిలు రూ.384 కోట్లు
  • ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ.960 కోట్లు
  • పంటల బీమా బకాయిల కోసం రూ. 716 కోట్లు
  • రైతుల పరిహారం కోసం రూ.23 కోట్లు

More Telugu News