రాజస్థాన్‌పై బ్లాక్ ఫంగస్ పంజా.. అంటువ్యాధిగా ప్రకటించిన ప్రభుత్వం

Black Fungus Declared An Epidemic In Rajasthan
  • రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం కింద గుర్తింపు 
  • రాజస్థాన్‌లో వందకుపైగా బ్లాక్ ఫంగస్ కేసులు
  • జైపూర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు
కరోనా నుంచి కోలుకున్న వారిపై పగ సాధిస్తున్న బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) రాజస్థాన్‌పై పంజా విసురుతోంది. ఇప్పటి వరకు అక్కడ 100కుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారినపడిన వారికి చికిత్స అందించేందుకు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు కేటాయించారు.

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్లాక్‌ఫంగస్‌ను కూడా అంటువ్యాధిగా గుర్తిస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం-2020 కింద దీనిని గుర్తించదగిన వ్యాధుల్లో చేర్చినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా తెలిపారు. బ్లాక్‌ ఫంగస్, కరోనాలకు సమగ్రమైన, సమన్వయంతో కూడిన చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Go Back to Shorts
Rajasthan
Jaipur
Black Fungus
Epidemic

More Telugu News