'నా చెల్లెల్ని కూడా పెళ్లాడితేనే మన పెళ్లి జరుగుతుంది' అన్న యువతి.. సరేనన్న పెళ్లికొడుకు.. కుదరదన్న పోలీసులు!
- కర్ణాటకలోని వేగమడుగు గ్రామంలో ఘటన
- మూగ, బధిర చెల్లెలి కోసం అక్క అసాధారణ నిర్ణయం
- యువకుడ్ని ఒప్పించిన వైనం
- అక్కాచెల్లెళ్లకు తాళికట్టిన యువకుడు
- చెల్లెలు మైనర్ అంటూ కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ పెళ్లిలోనే ఆశ్చకర్యరమైన ఘటన జరిగింది. ఉమాపతి తాళి కట్టబోతుండగా, సుప్రియ అడ్డుచెప్పింది. తన చెల్లెలి పరిస్థితి వివరించి, ఆమెను కూడా పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటేనే తాను తాళి కట్టించుకుంటానని షరతు పెట్టింది. లేకపోతే ఈ పెళ్లి జరగదని తెగేసి చెప్పింది. దాంతో పెళ్లి మంటపంలో కలకలం రేగింది. అయితే, అక్కడి పెద్దలు మానవతాదృక్పథంతో వ్యవహరించి ఉమాపతికి నచ్చచెప్పడంతో, ఆ యువకుడు అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ తాళికట్టాడు.
కానీ, అనూహ్యరీతిలో పోలీసులు రంగప్రవేశం చేసి, చిన్నదైన లలితకు ఇంకా మైనారిటీ తీరలేదంటూ కేసు నమోదు చేశారు.