Work From Home: మే 31 వరకు ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం... కేంద్రం కీలక నిర్ణయం

  • కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం
  • దివ్యాంగులు, గర్భవతులైన ఉద్యోగులకు వెసులుబాటు
  • తాజాగా ఉత్తర్వులు జారీ
  • మే 31 వరకు అమలు
Centre orders work from home to govt employees

ప్రభుత్వ ఉద్యోగుల్లోని కొన్ని వర్గాలకు కేంద్రం వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది. దేశంలో కొవిడ్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులైన ఉద్యోగులు, గర్భవతులైన ఉద్యోగులు, కంటైన్మెంట్ జోన్ లో నివసించే అధికారులు, ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేసుకోవచ్చని ఓ ప్రకటనలో వెల్లడించింది. మే 31 వరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుందని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ తెలిపింది.

అంతకుముందు, ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మందికి వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించిన కేంద్రం... తాజా ప్రకటన ద్వారా ఆ సదుపాయాన్ని మరింతమందికి అందించింది. ఈ ఉత్తర్వులు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు వర్తిస్తాయి. గ్రూప్-ఏ ఉద్యోగులకు పనిగంటలు తగ్గించారు. ఆఫీసులకు హాజరయ్యే ఉద్యోగులు కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది.

More Telugu News