కరోనా కాటు: మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో వరుస విషాదాలు
- గత నెల 23న వేద తల్లి కన్నుమూత
- అదే రోజు వెంటిలేటర్పై సోదరి
- తన ప్రపంచం కుదుపులకు గురైందన్న వేద
తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వాత్సలకు అదే రోజు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. తొలుత కొంత కోలుకున్నట్టే కనిపించిన ఆమె పరిస్థితి విషమించడంతో మొన్న మృతి చెందారు. కాగా, కరోనా బారినపడిన వేద తండ్రి, సోదరుడు, రెండో అక్కతోపాటు కుటుంబంలో మరికొందరు కోలుకున్నారు. తన కుటుంబం, తన ప్రపంచం ఒక్కసారిగా కుదుపునకు గురైందని వేద ఆవేదన వ్యక్తం చేసింది. అక్కకు వీడ్కోలు చెప్పాల్సి రావడంతో ఎంతో బాధగా ఉందని పేర్కొంది.