పుంగనూరులో ఆర్టీసీ డిపో... కడపలో ఏరియా ఆసుపత్రి... వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్
- నేడు రెండు ప్రారంభోత్సవాలు
- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్
- సంతోషం వ్యక్తం చేసిన సీఎం జగన్
- కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ మిథున్ రెడ్డి
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఆర్టీసీ డిపో, ఆసుపత్రి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కాగా, పుంగనూరులో ఆర్టీసీ డిపో ఏర్పాటు ద్వారా ప్రజల కల సాకారమైందని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. అందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పారు.