అమరరాజా సంస్థకు హైకోర్టులో ఊరట
- అమరరాజా సంస్థపై ఇటీవల ఏపీపీసీబీ కొరడా
- కాలుష్య నిబంధనలు పాటించడంలేదంటూ మూసివేత ఆదేశాలు
- అమరరాజా పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేత
- హైకోర్టును ఆశ్రయించిన గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు
గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థకు చిత్తూరు జిల్లాలో పలు చోట్ల బ్యాటరీ తయారీ ప్లాంట్లు ఉన్నాయి. అయితే కొంతకాలంగా అమరరాజా పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడంలేదని ఏపీపీసీబీ భావిస్తోంది. ఈ క్రమంలోనే మూసివేత ఆదేశాలు ఇచ్చింది. దీనిపై అమరరాజా వర్గాలు స్పందిస్తూ, తమది బాధ్యతాయుతమైన సంస్థ అని పేర్కొన్నాయి. ఎన్నో ఏళ్లుగా తమ పరిశ్రమల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించాయి. కాలుష్య నియంత్రణ కోసం భారీగా వెచ్చిస్తున్నామని తెలిపాయి.