నాన్ స్టాప్ గా 'శ్యామ్ సింగ రాయ్' షూటింగ్!
- విడుదలకు సిద్ధంగా 'టక్ జగదీశ్'
- ముగింపు దశలో 'శ్యామ్ సింగ రాయ్'
- కథానాయికలుగా సాయిపల్లవి, కృతి శెట్టి
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా రూపొందుతోంది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. నానీతో పాటు ఇతర తారాగణం ఈ షూటింగులో పాల్గొంటోంది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా షూటింగు కానిచ్చేస్తుండటం విశేషం. భారీ సెట్ లో షూటింగు కావడంతో .. పరిమితమైన సిబ్బందితో .. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ చేస్తున్నారు. నాని సరసన సాయిపల్లవి .. కృతి శెట్టి కనిపించనున్నారు. 'టక్ జగదీశ్' తరువాత ఈ సినిమా థియేటర్లకు రానుంది.