తమిళ సినీ హాస్యనటుడు పాండు మృతి
- ఇటీవల కరోనా బారినపడిన పాండు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
- పాండు భార్యకు కూడా కొవిడ్ పాజిటివ్
- ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమం
పాండు కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటితరం హీరోలతోనూ ఆయన పలు చిత్రాల్లో కనిపించారు. పాండు సోదరుడు సెల్వరాజ్ కూడా నటుడే. పాండు హాస్యనటుడే కాదు, మంచి డిజైనర్ కూడా. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తును డిజైన్ చేసింది పాండునే. దాంతోపాటు తమిళనాడు టూరిజం లోగోను కూడా ఆయనే రూపొందించారు.