Vijay Sai Reddy: లోకేశ్ ప్రసన్నం కోసం అచ్చెన్న మరీ దిగజారి డప్పు వాయిస్తున్నాడు: విజ‌య‌సాయిరెడ్డి

  • లోకేశ్ గురించి అచ్చెన్న‌ అగౌరవంగా మాట్లాడారు
  • చిట్టి నాయుడు సీరియస్ గా తీసుకుంటాడేమో అని ఇప్పుడు టెన్షన్
  • అయినా చేసిన‌ మాటల‌కే కట్టుబడి ఉండు అచ్చెన్నా  
vijay sai reddy slams tdp

టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. టీడీపీ నేత‌ లోకేశ్ పై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, దీంతో ఇప్పుడు ఆ విష‌యంపై భ‌య‌ప‌డుతున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.  

'లోకేశ్  ప్రసన్నం కోసం అచ్చెన్న మరీ దిగజారి డప్పు వాయిస్తున్నాడు. అగౌరవంగా  "వాడు సరిగా ఉంటే పార్టీకి ఈ గతి ఎందుకు పడుతుంది" అనడాన్ని చిట్టి నాయుడు సీరియస్ గా తీసుకుంటాడేమో అని టెన్షన్ పడుతున్నట్టుంది. పార్టీ ఉండదూ, బొక్కా ఉండదని ఉన్నమాటే అన్నావ్. ఆ మాటకే కట్టుబడి ఉండు అచ్చెన్నా' అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.  

More Telugu News