ఏపీలో ఉదయం 6 గంటలకే తెరచుకోనున్న మద్యం దుకాణాలు!
- నేటి నుంచి అమలుకానున్న కర్ఫ్యూ
- మధ్యాహ్నం 12 గంటల తరువాత అన్ని దుకాణాలూ బంద్
- మద్యం డిపోలకు కూడా నిబంధనల వర్తింపు
గతంలో మద్యం దుకాణాలు ఉదయం 11 గంటలకు తెరచి, రాత్రి 9 గంటలకు మూసేస్తుండేవారు. ఇప్పుడు పరిస్థితి మారగా, మద్యం దుకాణాల వద్ద రద్దీని నియంత్రించేందుకు ఉదయం నుంచే షాపులను తెరవాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించి, ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మద్యం సరఫరాలు చేసే డిపోలు కూడా ఇవే నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.