భారత్లో ఉండి వస్తే ఐదేళ్ల జైలు శిక్ష.. తమ పౌరులపై ఆస్ట్రేలియా కఠిన ఆంక్షలు
- దేశ చరిత్రలోనే తొలిసారి కఠిన ఆంక్షలు
- భారత్లో 9 వేల మంది ఆస్ట్రేలియన్లు
- వారిలో 600 మందికి కరోనా సోకే ప్రమాదం
- ఐపీఎల్లో ఆడుతున్న ఆసీస్ క్రికెటర్లకు మినహాయింపు!
భారత్లో 9 వేల మంది ఆస్ట్రేలియన్లు నివసిస్తుండగా, వారిలో కనీసం 600 మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా, బయో సెక్యూరిటీ చట్టం కింద తీసుకొచ్చిన ఈ సరికొత్త నిబంధనల నుంచి ఐపీఎల్లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, శిక్షణ సిబ్బందికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను ఆస్ట్రేలియా ఇప్పటికే నిషేధించింది.